హైదరాబాద్, మార్చి 16: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఈటో..భారత్లో తొలిసారిగా మహిళా డ్రైవర్లచేత మూడు చక్రాల వాహన ర్యాలీ హైదరాబాద్కు చేరుకున్నది. కన్యాకుమారి టు కశ్మీర్ చేపట్టిన ఈ ర్యాలీ ఎనిమిది రోజుల్లో వెయ్యి కిలోమీటర్లు పూర్తైనట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బీ), ఎలక్ట్రిక్ మొబిలిటీ యాస్ ఏ సర్వీస్తో కలిసి ఈటో మోటర్స్ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నది. దీంట్లోభాగంగా క్లీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా 800 ఈవీ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పింది. ఎనిమిది మంది సభ్యులు కలిగిన ఈ టీం 30 రోజుల్లో 3,333 కిలోమీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.