ముంబై, అక్టోబర్ 6: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్ జ్యూవెల్లర్స్..వచ్చే దీపావళి నాటికి మరో 33 షోరూంలను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ ఏడాది చివరినాటికి దేశీయ అవుట్లెట్ల సంఖ్య 51కి చేరుకోనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
దక్షిణభారతంలో ఇప్పటికే పాగావేసిన సంస్థ..ఉత్తర భారతంలో దృష్టి సారించడంలో భాగంగా ఇటీవల కాలంలో ఇక్కడ 20 నూతన షోరూంలను ప్రారంభించినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.