హైదరాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ) : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను డిజిటలైజ్ చేసేందుకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం దేశంలోని ప్రముఖ శోధక ఇంజిన్ జస్ట్ డయల్తో అవగాహన ఒప్పందం చేసుకొన్నది.
ఈ ఒప్పందం ప్రకారం.. ఎంఎస్ఎంఈలు డిజిటల్ వ్యాపారం వైపు మళ్లడం ద్వారా మార్కెటింగ్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంతోపాటు కస్టమర్లకు మరింత చేరువకావచ్చు. అంతేగాక, జేడీ మార్ట్, జేడీ పే వంటి అనేక ఇతర జస్ట్ డయల్ ప్లాట్ఫామ్లలో ఎంఎస్ఎంఈలకు యాక్సిస్ లభిస్తుంది.