న్యూఢిల్లీ, మే 10: జేఎస్డబ్ల్యూ గ్రూప్ సంస్థ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్.. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) దిశగా వడివడిగా అడుగులేస్తోంది. ఇప్పటికే డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ)ను క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి దాఖలు చేసింది. ఐపీవో ద్వారా రూ.2,800 కోట్ల వరకు నిధులను సమీకరించాలని జేఎస్డబ్ల్యూ ప్రయత్నిస్తున్నట్టు చెప్తున్నారు. కాగా, ఈ నిధులను రుణభారం తగ్గించుకోవడానికి, వ్యాపార కార్యకలాపాల విస్తరణకు వాడుకోవాలని సంస్థ చూస్తున్నది.