న్యూఢిల్లీ, మార్చి 25: ఆర్థిక మాంద్యం భయాలు దేశీయ స్టార్టప్లను వదలడం లేదు. మాంద్యంతో ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు వేలాది మంది సిబ్బందిని తొలగించగా..తాజాగా స్టార్టప్లు వేలాది మందికి ఉద్వాసన పలికాయి. కనీసంగా 82 దేశీయ స్టార్టప్లు 23 వేల మంది సిబ్బందిని తొలగించినట్లు మీడియా సంస్థ ‘ఇన్స్42’ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వీటిలో నాలుగు యూనికార్న్ స్టార్టప్లతో కలుపుకొని 19 ఎడ్యుటెక్ స్టార్టప్లు ఉండటం విశేషం. ఈ సంస్థలు 8,460 మందిపై వేటు వేశాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు తొలగించినట్లు తెలిపింది.
ఉద్యోగులను తొలగించిన స్టార్టప్లు