హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): గోల్డెన్జూబ్లీ సందర్భంగా జేఎన్టీయూ హైదరాబాద్లో ఈ నెల 6న మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్టు వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తెలిపారు. విప్రో, టెక్మహీంద్రా, ఇంటెల్ వంటి 20 కంపెనీలు పాల్గొనే మేళాలో మొత్తం 2,824 పోస్టులకు ఉద్యోగులను తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. మెగా జాబ్మేళాలో పాల్గొనాలనుకొనే విద్యార్థులు https://forms.gle/YwiYpgoPoruto8TRA పోర్టల్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకోవాలని సూచించారు.