Jio-HBO | గేమ్స్ ఆఫ్ థ్రోన్స్, సక్సెషన్ వంటి హాలీవుడ్ సూపర్ హిట్ సిరీస్ల అభిమానులకు గుడ్న్యూస్.. త్వరలో వార్నర్ బ్రదర్స్. డిస్కవరీ, హెచ్బీవో వంటి సూపర్ హిట్ సిరీస్లు భారతీయ వీక్షకులకు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. హెచ్బీవో రూపొందించిన వీడియో కంటెంట్ను రిలయన్స్ అనుబంధ లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ `జియో సినిమా` యాప్లో ప్రసారం అవుతాయి. ఈ మేరకు రిలయన్స్ అనుబంధ సంస్థ వయాకాం 18 (Viacom 18).. వార్నర్ బ్రదర్స్ (Warner Bro)తో ఒప్పందం చేసుకున్నదని వయాకాం 18 వర్గాలు తెలిపాయి. త్వరలోనే రెండు సంస్థలు ఈ డీల్పై ప్రకటన చేస్తాయని తెలుస్తున్నది.
ఇప్పటికే ఐపీఎల్ టోర్నీ ఉచిత ప్రసారం, ఫిఫా వరల్డ్కప్ -2022 ప్రసారాలతో జియో సినిమా యాప్.. దేశమంతా పాపులారిటీ సొంతం చేసుకున్నది. తాజాగా వార్నర్ బ్రదర్స్తో ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆ రెండు సంస్థల కంటెంట్తో ఇతర లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లకు గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్ వయాకాం 18.. 2023-27 మధ్యకాలంలో ఐపీఎల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు స్వంతం చేసుకున్న విషయం అందరికీ విదితమే.
గతంలో డిస్నీ+హాట్స్టార్ ఓటీటీ వేదికగా వార్నర్ బ్రదర్స్, హెచ్బీవోల టీవీ షోలు, సినిమాలు భారతీయులకు అందుబాటులో ఉండేవి. గత నెలాఖరు నుంచి భారత్లో డిస్నీ + హాట్ స్టార్ తన ప్రసారాలు నిలిపేసింది. తాజాగా ఈ కంటెంట్ ప్రసారానికి రిలయన్స్- వార్నర్ బ్రదర్స్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఒప్పందంతో ప్రపంచవ్యాప్తంగా లక్షల గంటలకు పైగా అందుబాటులో ఉన్న టీవీ షోలు, సినిమాలు, ప్రధాన స్పోర్ట్స్ టోర్నీలు ఇక జియో సినిమా యాప్ ద్వారా వీక్షకులకు అందుబాటులోకి వస్తాయి.