హైదరాబాద్, సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): నగరంలో జియోస్పేషియల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను టీ హబ్తో కలిసి హెక్సగాన్ కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి శుక్రవారం ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. డిజిటల్ రియాల్టీ సొల్యూషన్స్ అందించడంలో గ్లోబల్ లీడర్గా ఉన్న హెక్సాగన్… టీ హబ్లో తమ ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల స్టార్టప్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని టీ హబ్ సీఈవో ఎం శ్రీనివాస రావు అన్నారు.
జియోస్పేషియల్ టెక్నాలజీకి సంబంధించిన స్టార్టప్లకు ఇలాంటి కేంద్రాల ద్వారా ప్రయోజనం కలుగుతుంది. తద్వారా చాలా వేగంగా తమ స్టార్టప్ కార్యకలాపాలను విస్తరించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. హెక్సాగన్ కెపబిలిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ నవనీత్ మిశ్రా మాట్లాడుతూ.. గ్లోబల్లోనే అతి పెద్ద ఆర్అండ్ డీ హబ్ను ఇక్కడే ఏర్పాటు చేశామని, దీని ద్వారా వ్యాపార కార్యకలాపాల నిర్వహణతో పాటు సరికొత్త ఆవిష్కరణలు చేసే స్టార్టప్లకు సహకరించేలా ఈ కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు.