హైదరాబాద్, నవంబర్ 13: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. రాష్ట్రవ్యాప్తంగా తన ఎయిర్ఫైబర్ సేవలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 115 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ..తెలంగాణలో ఒకేసారి 20 నగరాల్లో ప్రారంభించింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ-ఎన్సీఆర్లోనూ స్టార్ట్ చేసింది.
దేశవ్యాప్తంగా 115 నగరాల్లో..
దేశవ్యాప్తంగా మరో 115 నగరాల్లో జియో ఫైబర్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో ఢిల్లీ-ఎన్సీఆర్తోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 నగరాల్లో, గుజరాత్ రాష్ట్రంలో 25 నగరాలు, కర్ణాటకలోని 21 నగరాలు, మహారాష్ట్రలోని 14 నగరాలు, తమిళనాడులోని 22 నగరాల్లో ఈ ఫైబర్ సేవలు ప్రారంభించినట్లు తెలిపింది.
తెలంగాణలో..
కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్, అర్మూర్, జగిత్యాల్, మిర్యాలగూడ, నిర్మల్, నిజామాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, రామగుండం, సంగారెడ్డి, పాల్వంచ, పెద్దపల్లి, సూర్యపేట్, తాండూర్, సిద్దిపేట, సిరిసిల్లా, వరంగల్లో అందుబాటులోకి వచ్చాయి. కాగా, ఆరు నెలలు, ఏడాది కాలపరిమితితో ఎయిర్ఫైబర్ 5జీ ప్లాన్లను జియో ఫైబర్ ప్రవేశపెట్టింది. రూ.599 మొదలుకొని రూ.3,999 గరిష్ఠ స్థాయిలో ప్లాన్లు ఉన్నాయి. ఇన్స్టాలేషన్ కోసం ముందుగా రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది.