ముంబై : (Jio-BP mobility stations) రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్), బీపీ సంస్థల సంయుక్తాధ్వర్యంలో తొలి మొబిలిటీ స్టేషన్ ప్రారంభమైంది. మహారాష్ట్ర నవీ ముంబైలోని నవేడ్లో మొదటి జియో-బీపీ బ్రాండ్ మొబిలిటీ స్టేషన్ను ప్రారంభించారు. వినియోగదారులకు ఇక్కడ వివిధ రకాల ఇంధనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న 1400 ఇంధన స్టేషన్ల నెట్వర్క్ జియో-బీపీగా రీబ్రాండ్ చేయనున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని విలువైలన ప్రతిపాదనలు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్ వాహనాలకు ఛార్జింగ్ పాయింట్లు కూడా ఈ మొబిలిటీ స్టేషన్లలో అందుబాటులోకి రానున్నాయి.
భారతదేశంలో ఇంధనం, మొబిలిటీ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్నది. వచ్చే 20 ఏండ్లలో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంధన మార్కెట్లలో ఒకటిగా మన మార్కెట్ ఉంటుందని అంచనా. పెరుగుతున్న ఈ డిమాండ్కు అనుగుణంగా జియో-బీపీ మొబిలిటీ స్టేషన్లను రూపొందించారు. ఈ స్టేషన్లు వినియోగదారులకు మెరుగైన ఇంధనం, ఈవీ ఛార్జింగ్, రిఫ్రెష్మెంట్లు, భోజనంతో పాటు అనేక రకాల సేవలను అందించనున్నాయి. భవిష్యత్లో తక్కువ కార్బన్ సొల్యూషన్స్ను ప్రవేశపెట్టే ప్రణాళికలు కూడా ఉన్నట్లు జియో-బీపీ సంస్థలు వెల్లడించాయి.
ఈ మొబిలిటీ స్టేషన్లలో క్యాస్ట్రాల్ ఇంజిన్ ఆయిల్ కొనుగోలు చేసిన ద్విచక్రవాహనదారులకు ఉచితంగా ఆయిల్ చేంజ్ చేసే సేవలు కూడా అందించనున్నది. మొబిలిటీ స్టేషన్లు, ఇతర ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ రీప్లేస్మెంట్ స్టేషన్ల నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ జాయింట్ వెంచర్, భారతదేశంలో ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కీలక పాత్ర పోషించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తున్నది.
సూడాన్లో సైనిక తిరుగుబాటు, దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఏడుగురు మృతి
మీ ఎజెండాతో పార్టీకి నష్టం కలిగించకండి: సోనియాగాంధీ
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
గాయాల గురించి చెప్పే స్మార్ట్ బ్యాండేజ్ వచ్చేసింది..!
హైబీపీ ఉన్నదని తెలిపే లక్షణాలివే..!
ఈ చెక్క కత్తి .. స్టీల్ కత్తి కంటే వెరీ షార్ప్ గురూ!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..