న్యూఢిల్లీ, మార్చి 6: ప్రముఖ ఇంధన విక్రయ సంస్థ జియో-బీపీ..దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన(ఈవీ)చార్జింగ్ మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ హీరానందానితో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంలో భాగంగా హీరానందానికి ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో ఉన్న ప్రాపర్టీలో ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నది.
ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో జియో-బీపీ పల్స్..దేశవ్యాప్తంగా మాల్స్, రెస్టారెంట్లు, హోటళ్లు, రెసిడెన్షియల్ సొసైటీలు, పబ్లిక్ పార్కింగ్లలో వేగవంతమైన చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పుతున్నది. దీంట్లోభాగంగానే బుధవారం తాజాగా హీరానందానితో జట్టుకట్టింది.