Jio AirFiber | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: రిలయన్స్ జియో ఎయిర్ఫైబర్ సేవల్ని మంగళవారం ప్రకటిం చింది. తొలుత హైదరాబాద్సహా దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో ప్రారంభించినట్టు తెలిపింది. నెలవారీ కనిష్ఠ ప్లాన్ ధర రూ. 599గా ఉంటే.. గరిష్ఠ ప్లాన్ ధర రూ. 3,999గా ఉన్నది. గత నెల జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 46వ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో జియో ఎయిర్ఫైబర్ను అందుబాటులోకి తెస్తామని కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించినది తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా, పుణె, అహ్మదాబాద్ నగరాల్లో తీసుకొచ్చారు.
జియో ఎయిర్ఫైబర్ అంటే?
జియో ఎయిర్ఫైబర్.. ఓ వైఫై హాట్స్పాట్ లేదా రౌటర్ వంటిదే. అయితే ప్రస్తుతమున్న జియో ఫైబర్కు భిన్నంగా ఉంటుంది. జియో ఫైబర్ అనేది వైర్ ఆధారిత ఇంటర్నెట్ సేవల్ని అందిస్తుంది. జియో ఎయిర్ఫైబర్కు వైర్ అక్కర్లేదు. ఇదో హై-స్పీడ్ 5జీ టెక్నాలజీ డివైజ్. దీన్ని కొనుగోలు చేసి ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆన్ చేస్తే సమీపంలోని జియో టవర్కు కనెక్ట్ అవుతుంది. ఆపై ఇంట్లోని వారంతా ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు.
ఇలా బుక్ చేసుకోవచ్చు..
ఆసక్తిగలవారు మీకు దగ్గర్లోని జియో స్టోర్కు వళ్లైనా, www.jio.comను సందర్శించిగానీ, వాట్సాప్పై 60008 60008 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారాగానీ రూ.100 చెల్లించి జియో ఎయిర్ఫైబర్ను బుక్ చేసుకోవచ్చు. ఆపై ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా కంపెనీ మిమ్మల్ని సంప్రదిస్తుంది. అయితే ఇన్స్టాలేషన్ చార్జీ రూ.1,000 ఉంటుంది. కానీ వార్షిక ప్లాన్ తీసుకుంటే ఈ చార్జీ ఉండదు.