న్యూఢిల్లీ : 2022లో జీప్ ఇండియా ఏకంగా మూడు ఎస్యూవీలను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. రెండు ఆల్ న్యూ ఎస్యూవీలను భారత్లో ప్రవేశపెడుతుండగా జీప్ కంపాస్ ట్రయల్హాక్ వేరియంట్ను తిరిగి తీసుకువస్తోంది. ఫిబ్రవరిలో కంపాస్ ట్రయల్హాక్ పేరుతో తిరిగి లాంఛ్ చేస్తోంది. ఆపై జీప్ మెరిడియన్, న్యూ జీప్ గ్రాండ్ చెరోకీలను లాంఛ్ చేయనుంది.
గత ఏడాది కంపాస్ ఫేస్లిఫ్ట్ను ఇంట్రడ్యూస్ చేసిన క్రమంలో నిలిపివేసిన కంపాస్ ట్రయల్హాక్ను తిరిగి ప్రవేశపెట్టేందుకు జీప్ ఇండియా సన్నద్ధమైంది. అయితే పరిమిత ప్రొడక్షన్గానే ఈ ఎస్యూవీని కంపెనీ కస్టమర్ల ముందుకు తీసుకురానుంది. ట్రయల్హాక్ ఎస్యూవీ 2022 అవతార్లో భాగంగా ఈ ఎస్యూవీని లేటెస్ట్ స్టైలిష్ లుక్లో జీప్ ఇండియా తీసుకురానుంది.
ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టం, విభిన్న బంపర్లు, రీడిజైన్డ్ అలాయ్ వీల్ డిజైన్లతో ఈ ఎస్యూవీ కస్టమర్లను ఆకట్టుకుంటుందని కంపెనీ భావిస్తోంది. ఇక భారీ పెట్టుబడులతో మూడు ఎస్యూవీలను దేశీ మార్కెట్ బరిలో దింపేందుకు జీప్ ఇండియా సన్నాహాలు చేస్తోంది.