న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రధానమంత్రి జన్ధన్ యోజన (పీఎంజేడీవై) పథకం కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల సంఖ్య 43 కోట్లకు పెరిగింది. వీటిలో డిపాజిట్ల మొత్తం రూ.1.46 కోట్లకు చేరినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఈ పథకం మొదలై ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆర్థిక శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్రమోది 2014 ఆగస్టు 15న ప్రకటించిన ఈ పథకం అదే ఏడాది ఆగస్టు 28న ఆరంభమయ్యింది. ఈ ఏడాది ఆగస్టు 18నాటికల్లా పీఎంజేడీవై ఖాతాల సంఖ్య 43.04 కోట్లకు చేరిందని, ఇందులో మహిళల ఖాతాలు 55.47 శాతమని (23.87 కోట్లు), చిన్నపట్లణాలు, గ్రామీణ ప్రాంతాల వారికి 66.69 శాతం (28.7 కోట్లు) ఖాతాలు ఉన్నాయని ఆర్థిక శాఖ ప్రకటనలో తెలిపింది. మొత్తం జీఎంజేడీవై ఖాతాల్లో 36.86 కోట్లు (85.6 శాతం) ప్రస్తుతం నిర్వహణలో ఉన్నాయని ప్రకటనలో పేర్కొంది.