ITR filing | గత ఆర్థిక సంవత్సరా (2021-22)నికి ఐటీ రిటర్న్స్ దాఖలులో రికార్డులు హోరెత్తుతున్నాయి. శుక్రవారం వరకు గడువు పొడిగింపుపై ఆశలు పెట్టుకున్న వేతన జీవులు, పన్ను చెల్లింపుదారుల ఆశలు అడియాసలవుతున్నాయి. 2020, 2021లలో కరోనా, న్యూ ఇన్కం టాక్స్ పోర్టల్లో సమస్యల కారణంగా గడువు పొడిగించింది ఆదాయం పన్ను విభాగం.. ఈ దఫా అందుకు అవకాశం లేదని తెగేసి చెప్పింది. సకాలంలో ఐటీఆర్లు సబ్మిట్ చేయాలని ఆదేశించింది. ఫలితంగా శుక్రవారం వరకు 4.52 కోట్ల మంది ఐటీఆర్లు దాఖలు చేశారు. శనివారం కొత్తగా 35,67,263 మంది ఐటీఆర్లు సబ్మిట్ చేశారు. శనివారం సాయంత్రం ఆరు గంటలకల్లా (చివరి గంటలో) కొత్తగా 4,48,676 మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేశారు.
2021-22 ఆర్థిక సంవత్సర ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు పొడిగించే ప్రసక్తే లేదని ఇటీవల కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది ఆదాయం పన్ను విభాగం. 1800 103 0025 లేదా 1800 419 0025 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని, లేనిపక్షంలో orm@cpc.incometax.gov.in. అనే మెయిల్ అడ్రస్లో ఫిర్యాదు చేయాలని కోరింది. ఐటీ విభాగం తన ట్విట్టర్ హ్యాండిల్పై టోల్ ఫ్రీ నంబర్లు, ఈ-మెయిల్ అడ్రస్ ట్వీట్ చేసింది.
శుక్రవారం (జూలై 29) ఒక్కరోజే 43 లక్షల ఐటీఆర్లు దాఖలయ్యాయి. ఈ రోజు (శనివారం) దాదాపు 50 లక్షల ఐటీఆర్లు దాఖలవుతాయని భావిస్తున్నారు. హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్యూఎఫ్), వేతన జీవులు మాత్రం ఐటీఆర్లు జూలై 31 లోపు దాఖలు చేయాలి.
Some more statistics of Income Tax Returns filed today.
35,67,263 #ITRs have been filed upto 1800 hours today & 4,48,676 #ITRs filed in the last 1hour.
For any assistance, please connect on orm@cpc.incometax.gov.in.
We will be glad to assist!@FinMinIndia— Income Tax India (@IncomeTaxIndia) July 30, 2022