IT Returns | న్యూఢిల్లీ, ఆగస్టు 1: ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరం, 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి రికార్డుస్థాయిలో ఆదాయపు పన్ను రిటర్న్లు ఫైల్ అయ్యాయి. ఫైలింగ్కు గడువుతేదీ అయిన జూలై 31నాటికి 6.77 లక్షల రిటర్న్లు దాఖలైనట్టు మంగళవారం ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది.
గత అసెస్మెంట్ సంవత్సరంలో 2022 జూలై 31నాటికి దాఖలైన రిటర్న్లు 5.83 కోట్లతో పోలిస్తే 16.1 శాతం పెరిగాయని, 53.67 లక్షల మంది తొలిసారి రిటర్న్లు ఫైల్ చేసినవారున్నారని వివరించింది. ఖాతాల ఆడిటింగ్ అవసరం లేని వ్యక్తులు, సంస్థలు రిటర్న్లు ఫైల్ చేసేందుకు జూలై 31 చివరితేదీ కాగా, ఖాతాల్ని ఆడిటింగ్ జరపాల్సిన కార్పొరేట్లు, వ్యక్తులు రిటర్న్ దాఖలు చేయడానికి అక్టోబర్ 31 గడువు తేదీ.