హైదరాబాద్, ఆగస్టు 25: పెంపుడు జంతువుల ఆహార పదార్థాల తయారీలో అగ్రగామి సంస్థ మార్స్ ఇండస్ట్రీస్..తెలంగాణలో తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే ఇక్కడ వందల కోట్ల పెట్టుబడి పెట్టిన సంస్థ..తాజాగా మరో రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఆర్ అండ్ డీని మరింత బలోపేతం చేయడంతోపాటు సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడానికి, పరిశోధనలపై ప్రత్యేక దృష్టి సారించింది.
ప్రారంభం : 23, జూన్ 1911
కార్యాలయం : వర్జీనియా, అమెరికా
ఇండస్ట్రీ : ఫుడ్, వెటర్నరీ సర్వీసులు
స్థాపించినవారు : ఫ్రాంక్లిన్ క్లారెన్స్ మార్స్
సీఈవో : పౌల్ విహారౌచ్(సెప్టెంబర్ 2022 నుంచి)
ఆదాయం : 4,500 కోట్ల డాలర్లు (2022)
ఉద్యోగులు : 1,30,000 (2020 నాటికి)
సబ్సిడరీలు : వీసీఏ ఇండస్ట్రీస్, వ్రిగ్లే కంపెనీ