న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ప్రస్తు తం మార్కెట్లో మరిం త చౌకగా లభిస్తున్నప్పటికీ, ఇప్ప ట్లో ఆ షేర్లలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు లేదా మరిన్ని షేర్లు కొనేందుకు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సిద్ధంగా లేదు. దేశంలో అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టరైన ఎల్ఐసీ అదానీ ఎఫ్పీవో ధరల శ్రేణి అప్పర్బ్యాండ్ రూ.3,276 వద్ద ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదే షేరు ఇప్పుడు 40 శాతం చౌకగా రూ.1,875 వద్ద మార్కెట్లో లభిస్తున్నది.
ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ ఒక ఆంగ్ల ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదానీ షేర్లపై వివరణ ఇస్తూ ఇప్పట్లో మరిన్ని పెట్టుబడులు చేయాలని గానీ, లేదా తమ వద్దనున్న షేర్లను విక్రయించాలని గానీ యోచించడంలేదని సూచన ప్రాయంగా చెప్పారు. ‘ప్రస్తుతం ఏమి చేయాలో కూడా మేము ఆలోచించడం లేదు. ఇంత తక్కువ సమయంలో నిర్ణయం తీసుకోవాలా వద్దా అనే కూడా ఆలోచన చేయలేం’ అని కుమార్ వ్యాఖ్యానించారు. గత కొద్ది సంవత్సరాలుగా అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ రూ.30,127 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు ఇటీవల పార్లమెంటులో ప్రభుత్వం వెల్లడించింది. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదిక వెలువడక ముందు ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ. 80,000 కోట్ల వరకూ ఉన్నప్పటికీ, ఇప్పుడది రూ.45,000 కోట్లకు తగ్గిపోయింది.