IT Returns | న్యూఢిల్లీ, జూలై 22: ఆదాయం పన్ను పరిధిలోని ఉద్యోగులపై ఐటీ శాఖ నజర్ పెట్టింది. పన్ను మినహాయింపు కోసం చాలామంది తప్పుడు పత్రాలు సమర్పిస్తున్నట్టు గుర్తించిన అధికారులు.. ఐటీ రిటర్న్లను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా లోతుగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
ప్రభుత్వం వేతన జీవులకు ఐటీ యాక్ట్ ప్రకారం ఇంటి అద్దె అలవెన్స్, అధికారిక కార్యకలాపాల నిర్వహణకు సహాయకులను నియమించుకొంటే, వారి వేతనాల మేరకు పన్ను మినహాయింపు, హోంలోన్లకు చెల్లించే వడ్డీ మేరకు పన్ను మినహాయింపులు ఇస్తున్నది. ఐటీఆర్ అనుమానాస్పదంగా ఉంటే మరిన్ని లిఖిత ఆధారాలు కావాలని ఐటీ శాఖ కోరుతున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐటీఆర్ తయారుచేసిన వారి వివరాలను కూడా అడుగుతున్నట్టు పేర్కొన్నాయి.