న్యూఢిల్లీ, మార్చి 4: జపాన్కు చెందిన యుటిలిటీ వాహన తయారీ సంస్థ ఇసూజు..కమర్షియల్ పిక్-అప్ విభాగ వాహన ధరలను లక్ష రూపాయల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో డీ-మ్యాక్స్, డీ-మ్యాక్స్ ఎస్-క్యాబ్ వాహనాలు మరింత ప్రియంకానున్నాయి. ప్రస్తుతం డీ-మ్యాక్స్ రెగ్యులర్ క్యాబ్ రూ.8.72 లక్షల నుంచి, డీ-మ్యాక్స్ ఎస్-క్యాబ్ రూ.10.7 లక్షల ప్రారంభ ధరతో లభిస్తున్నాయి.