హైదరాబాద్/శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ) మరోసారి సత్తాచాటింది. దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూళ్లలో ఐఎస్బీ మొదటి స్థానంలో నిలిచింది. 2023కిగాను ఫైనాన్షియల్ టైమ్స్(ఎఫ్టీ) గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్లో ఐఎస్బీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నట్లు ఐఎస్బీ డిప్యూటీ డీన్ రామభద్రన్ తిరుమలై ఒక ప్రకటనలలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 39వ ర్యాంక్ సాధించిన ఐఎస్బీ..ఆసియాలో 6వ ర్యాంక్ పొందింది. ప్రపంచవ్యాప్తంగావున్న టాప్-50 బిజినెస్ స్కూళ్లలో ఐఎస్బీకి చోటు లభించడం విశేషం. అత్యాధునిక బోధనాపద్ధతులు, ఆయా రంగాల్లో ఉన్నతంగా ఆలోచించే అధ్యాపక బృందం ఇందుకు దొహదపడ్డాయని ఆయన పేర్కొన్నారు.