న్యూఢిల్లీ, ఆగస్టు 29: భారత ఐటీ సర్వీసుల రంగం ఆదాయ వృద్ధి మందగిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ రంగం ఆదాయం 9.2 శాతం పెరగ్గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 శాతానికి పరిమితమవుతుందని ఇక్రా రేటింగ్స్ అంచనా వేసింది. అలాగే ఐటీ కంపెనీల లాభదాయకత కూడా నెమ్మదిస్తుందని, నిర్వహణా లాభాల మార్జిన్ 1 శాతం తగ్గుదలతో 20-21 శాతానికి దిగివస్తుందని పేర్కొంది. ఐటీ సేవలకు డిమాండ్ మందగిస్తున్నందున 2023-24లో ఐటీ కంపెనీల టర్నోవర్ వృద్ధి 3-5 శాతానికి పడిపోతుందని ఇక్రా ఐటీ రంగ హెడ్ దీపక్ జొత్వాని తెలిపారు. ఇక్రా రిపోర్ట్ వివరాలు&