న్యూఢిల్లీ : గత నెలరోజులుగా ఈకామర్స్ దిగ్గజ సంస్ధలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ బిగ్ దివాళీ సేల్ నిర్వహిస్తుండగా పలు ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేశాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ దివాళీ సేల్లో భాగంగా 5జీ ఫోన్లు సహా పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై తక్కువ ధరలను ఆఫర్ చేశాయి. సేల్ చివరిరోజు కావడంతో కస్టమర్లు తమకు నచ్చిన ప్రోడక్ట్లను ఆయా ఈకామర్స్ వేదికలపై తక్కువ ధరలకు సొంతం చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు.
ప్రీమియం శాంసంగ్ 5జీ ఫోన్ను అందుబాటు ధరలో కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈని రూ 35,999కే కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 13 ఫ్లిప్కార్ట్లో రూ 59,900 డిస్కౌంట్ ధరకు లిస్టయింది. దీని ఒరిజినల్ ప్రైస్ రూ 69,900. ఐఫోన్ 13 ఇంత తక్కువ ధరకు లభించేందుకు ఇదే చివరిరోజు కావడంతో కస్టమర్లు తమ డ్రీమ్ ఫోన్ను దక్కించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక నథింగ్ పోన్ 1 128జీబీ మోడల్ రూ 29,999 ప్రారంభ ధరకు లభిస్తుండగా, పిక్సెల్ 6ఏ ఫ్లిప్కార్ట్పై రూ 34,199పై లిస్టయింది. ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ 4200 ఆఫర్ అందుబాటులో ఉంది.
బ్యాంక్ కార్డు ఆఫర్తో ఈ ప్రీమియం ఫోన్ను రూ 30,000లోపు దక్కించుకోవచ్చు. ఇక అమెజాన్ దివాళీ సేల్లో శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ రూ 11,999కే లభిస్తోంది. ఇక రూ 20,000లోపు బెస్ట్ 5జీ ఫోన్ను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం రెడ్మి నోట్ 11 ప్రొ+ను పరిశీలించవచ్చు. ఇక రూ 30,000లోపు 5జీ ఫోన్ల కోసం మోటో ఎడ్జ్ 30, ఐక్యూ౦౦ నియో 6, పోకో ఎఫ్4 ఎంచుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఇవి డిస్కౌంట్ ధరపై లభించడంతో పాటు బ్యాంకు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్లోనూ కొన్ని 5జీ స్మార్ట్ఫోన్లు ఈకామర్స్ వేదికలపై లభిస్తున్నాయి. పోకో ఎం4 5జీ వంటి కొన్ని డివైజ్లు ఫ్లిప్కార్ట్పై డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి.