మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్.. కొత్త ఈటీఎఫ్ను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నది. నిఫ్టీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ప్రవేశపెడుతున్న ఈ ఫండ్ను సోమవారమే మార్కెట్కు పరిచయం చేస్తున్నారు. రూ.5వేల వరకు మదుపు చేసుకోవచ్చు. పీఎల్ఐ, మేక్ ఇన్ ఇండియా స్కీములతో దేశీయ ఉత్పాదక రంగాలలో భారీ వృద్ధి ఉంటుందని మిరే అంచనా వేస్తున్నది. ఎలక్ట్రిక్ వెహికిల్స్, బ్యాటరీ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ వంటి రంగాలలో మదుపు చేసే అవకాశాన్ని ఇన్వెస్టర్లు ఈ ఈటీఎఫ్ ద్వారా పొందవచ్చు. మాన్యుఫ్యాక్చరింగ్ ఇండెక్స్లోని షేర్లలో మదుపు చేయడమే ఈ ఫండ్ లక్ష్యం. ఈ ఫండ్ ఎన్ఎఫ్ఓ ఈ నెల 20న ముగుస్తుంది. ఆ తర్వాత ఎన్ఏవీ ఆధారితంగా ఈ ఫండ్ను కొనుగోలు చేయవచ్చు.