హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) హైదరాబాద్లో స్టార్టప్ల కోసం డెమోను నిర్వహించారు. సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ (సీఐఈ)ను ఏర్పాటు చేసి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకంగా స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇందులో 12 స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేందుకు 50కి పైగా పెట్టుబడి దారులు ఆసక్తి చూపారని సీఐఈ-ట్రిపుల్ ఐటీ హెచ్ సీవోవో రమేశ్ లోగనాథన్ తెలిపారు. ఇందులోని స్టార్టప్ల పెట్టుబడులను సమకూర్చేందుకు డెమో డేను నిర్వహించగా, చాలా మంది పెట్టుబడి దారులు ముందుకు వచ్చి ఆయా స్టార్టప్ల లక్ష్యాలను తెలుసుకొన్నారు. మొత్తం 12 స్టార్టప్లలో వారు పెట్టుబడులు పెడుతున్నారని ఆయన తెలిపారు.