New cars | న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: నయా కార్లు సందడిచేయబోతున్నాయి. వచ్చే నెలలో దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు తమ నూతన వాహనాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఆటోమొబైల్ రంగం టాప్గేర్లో దూసుకుపోతుండటంతో సంస్థలు ఇక్కడి మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా నూతన మాడళ్ళను రూపొందిస్తున్నాయి. ఇందుకోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకడుగు వేయడం లేదు. వచ్చే నెలలో ఎస్యూవీతోపాటు లగ్జరీ ఎస్యూవీ, సెడాన్, ప్రీమియం హ్యాచ్బ్యాక్ మాడళ్లు అందుబాటులోకి రానున్నాయి. మారుతి సుజుకీ, టాటా, బీఎండబ్ల్యూలు ఈ జాబితాలో ఉన్నాయి.
మారుతి సుజుకీ జిమ్నీ
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ..ఐదు డోర్లు కలిగిన జిమ్నీ మాడల్ను పరిచయం చేయబోతున్నది. వచ్చే నెల రెండో వారంలో ఈ కారును ప్రవేశపెడుతున్నది. ఈ ఏడాదికిగాను జరిగిన ఆటో ఎక్స్పోలో ప్రదర్శించింది. 1.5 లీటర్ల ఇంజిన్ కలిగిన ఈ మాడల్ నాలుగు-సిలిండర్, కే-సిరీస్ పెట్రోల్ ఇంజిన్తో రూపొందించింది.
టాటా అల్ట్రోజ్ ఐ-సీఎన్జీ
అల్ట్రోజ్ను సీఎన్జీ వెర్షన్లలో విడుదల చేయబోతున్నది టాటా మోటర్స్. ఇప్పటికే పంచ్ సీఎన్జీని విడుదల చేసిన సంస్థ..తాజాగా అల్ట్రోజ్ను ప్రవేశపెట్టబోతున్నది. 1.2 లీటర్ల రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన మాడల్పై మూడేండ్లు లేదా లక్ష కిలోమీటర్ల వ్యారెంటీ కల్పిస్తున్నది.
బీఎండబ్ల్యూ ఎక్స్3
దేశవ్యాప్తంగా 3 సిరీస్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని బీఎండబ్ల్యూ..సరికొత్త మాడల్ ఎం340ఐ పరిచయం చేయబోతున్నది. 3 లీటర్, ఆరు-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మాడల్ కేవలం 4.9 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది.