న్యూఢిల్లీ, జూన్ 29: ఇండిగో పేరుతో విమాన సేవలు అందిస్తున్న ఇంటర్గ్లోబల్ ఏవియేషన్ మరో మైలురాయికి చేరుకున్నది. తన మార్కెట్ విలువ తొలిసారిగా లక్ష కోట్లకు చేరుకున్నది. ఈ మైలురాయికి చేరుకున్న తొలి విమానయాన సంస్థ కూడా ఇండిగో కావడం విశేషం.
ఇటీవల కంపెనీ షేరు జెట్స్పీడ్ వేగంతో దూసుకుపోవడం ఇందుకు కారణం. బుధవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్ విలువ రూ.1,01,007.56 కోట్లకు చేరుకున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు కంపెనీ షేరు 30 శాతం పెరగగా..ఇదే సమయంలో సెన్సెక్స్ ఐదు శాతం రాబడిని ఇచ్చింది.