న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) డిపాజిట్ దారులకు శుభవార్తను అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 125 బేసిస్ పాయింట్లు లేదా 1.25 శాతం వరకు పెంచింది. పెరిగిన వడ్డీరేటు ఈ నెల 12 నుంచి అమలులోకి రానున్నది.
ఫిక్స్డ్ డిపాజిట్లతోపాటు ప్రత్యేక స్కీంను కూడా ప్రవేశపెట్టింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో 46 నుంచి 90 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేటు 125 బేసిస్ పాయింట్లు అధికంకానున్నది. అలాగే సీనియర్ సిటీజన్లక అదనంగా 50 బేసిస్ పాయింట్ల వడ్డీరేటును పెంచింది.