ముంబై, జూలై 21: టెలికాం ఆపరేటింగ్ కంపెనీ భారతి ఎయిర్టెల్ 5జీ నెట్వర్క్ను అభివృద్ధిపర్చేందుకు అంతర్జాతీయ చిప్ డిజైనింగ్, ప్రాసెసర్ల దిగ్గజం ఇంటెల్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇంటెల్ వర్చువల్, ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ టెక్నాలజీలను ఉపయోగించి, దేశీయంగా అవసరమైన సొల్యూషన్లను అభివృద్ధిపర్చడానికి ఇరు కంపెనీలు జతకలిసాయి. దేశంలోని కొన్ని నగరాల్లో భారతి ఎయిర్టెల్, ఇతర టెలికాం ఆపరేటర్లు ప్రస్తుతం 5జీ ట్రయిల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒప్పందంలో భాగంగా ఇంటెల్ థర్డ్ జనరేషన్ జియాన్ ప్రాసెసర్లు, ఇతర పరికరాల్ని ఎయిర్టెల్ తన నెట్వర్క్లో అమరుస్తుంది.