Mukesh Ambani | రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు తమ మనుమడు, మనుమరాలు మొదటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముకేశ్ అంబానీ కూతురు ఈషా అంబానీ- ఆనంద్ పిరమల్ దంపతులకు గతేడాది కవల పిల్లలు జన్మించారు. వారికి క్రుష్ణ, అదియాగా పేరు పెట్టారు. వారి మొదటి పుట్టిన రోజు వేడుకలు శనివారం జరిగాయి. ఈ వేడుకలకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
ముంబైలోని జియో వరల్డ్ గార్డెన్లో జరిగిన ఈ వేడుకలకు హాజరైన బాలీవుడ్ ప్రముఖుల్లో షారూఖ్ ఖాన్; కైరా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్, అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్, కరిష్మా కపూర్ తదితరులు ఉన్నారు. తారా సుతారియా, ఆర్పితా ఖాన్ కూడా పాల్గొన్నారు. జియో వరల్డ్ గార్డెన్.. ‘కంట్రీ ఫెయిర్’ థీమ్తో రూపుదిద్దుకున్నది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా జీవించే వివిధ జంతువులు, పక్షులు నివసిస్తుంటాయి.