న్యూఢిల్లీ, డిసెంబర్ 5: మరో మూడు సంస్థల ఐపీవోలకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతినిచ్చింది. వీటిలో ఐనాక్స్ ఇండియా, లగ్జరీ ఫర్నీచర్ బ్రాండ్ స్టేన్లీ లైఫ్ైస్టెల్ సంస్థల ఐపీవోలకు అనుమతినిచ్చింది.
వీటిలో రెండు సంస్థలు ఆగస్టు, సెప్టెంబర్ నెలలో దరఖాస్తు చేసుకున్నాయి. ఆఫర్ ఫర్ సేల్ రూట్లోనే ఆయా సంస్థల షేర్లు విక్రయించనున్నాయి. తమ వ్యాపార విస్తరణకు, రుణాలు తగ్గించుకోవడానికి అవసరమైన నిధులను ఐపీవో ద్వారా సేకరిస్తున్నాయి.