Infosys | ఇండియన్ ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో రెవెన్యూ 6.7 శాతం పెంచుకున్నది. నికర లాభం 3.32 శాతం గ్రోత్తో రూ.6,212 కోట్ల నికర లాభం గడించింది. గతేడాది (2022-23)లో రూ.6,021 కోట్ల నికర లాభానికే పరిమితమైంది. గతేడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది రెవెన్యూ రూ.36,538 కోట్ల నుంచి 6.7 శాతం పెరిగి 38,994 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈ ఫైలింగ్లో ఇన్ఫీ వెల్లడించింది. కరెన్సీ రూపంలో రెవెన్యూ 2.5 శాతం, త్రైమాసికం వారీగా 2.3 శాతం రెవెన్యూ పుంజుకున్నది.
సెప్టెంబర్ త్రైమాసికంలో ఇన్ఫీ నిర్వహణ లాభాలు 21 శాతం పెరిగాయి. 2022-23తో పోలిస్తే అట్రిక్షన్లు 27.1 నుంచి 14.6 శాతానికి దిగి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ త్రైమాసికంలో 770 కోట్ల విలువైన డీల్స్ పొందామని ఇన్ఫీ ఎండీ కం సీఈఓ సలీల్ పరేఖ్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో పెద్ద డీల్స్ పొందడంతో భవిష్యత్ కోసం పునాది వేసుకున్నామన్నారు.
లాభాలపై వాటాదారులకు ఒక్కో షేర్ పై రూ. 18 ఇంటరిం డివిడెండ్ ఇవ్వాలని ఇన్ఫీ నిర్ణయించింది. ఈ నెల 25న ఇంటరిం డివిడెండ్ ఖరారు చేయడంతోపాటు నవంబర్ ఆరో తేదీన చెల్లించాలని కూడా నిర్ణయించారు.