న్యూఢిల్లీ, మార్చి 13 : విమాన ప్రయాణికులకు ఇంధన సెగ గట్టిగానే తగులుతున్నది. ఇప్పటికే ఎయిర్ ఇండియా విమాన టికెట్లపై ఫ్యూయల్ సర్ చార్జీ విధించగా..తాజాగా విమానయాన దిగ్గజం ఇండిగో కూడా దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించేవారిపై రూ.2,300 వరకు ఫ్యూయల్ సర్చార్జీ విధిస్తున్నట్టు ప్రకటించింది.
దేశీయ విమాన టికెట్లపై రూ.425 విధించిన సంస్థ..అంతర్జాతీయ రూట్లపై రూ.2,300 విధించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో విమాన టికెట్ ధరలు మరింత పెరగనున్నాయి. దేశీయ రూట్లలో రూ.425, మిడిల్ ఈస్ట్ రూ.900, దక్షిణాసియా, చైనా, ఆఫ్రికా, పశ్చిమాసియా రూ.1,800, యూరప్పై రూ.2,300 పెరుగుతాయి.