న్యూఢిల్లీ, జనవరి 16: భారత్ వాణిజ్యం అంతకంతకూ క్షీణిస్తున్నది. రెండు, మూడు నెలలుగా ఎగుడుదిగుడులుగా నమోదవుతున్న ఎగుమతులు డిసెంబర్ నెలలో ఒక్కసారిగా 12 శాతం పతనమయ్యాయి. 2022 డిసెంబర్లో అంతక్రితం ఏడాది ఇదేనెలతో పోలిస్తే 39.27 బిలియన్ డాలర్ల నుంచి 34.48 బిలియన్ డాలర్లకు తగ్గినట్టు సోమవారం కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది నవంబర్ నెలలో 31.99 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయి.
డిసెంబర్లో ఎగుమతులకంటే దిగుమతులు స్వల్పంగా తగ్గడంతో వాణిజ్యలోటు 12.8 శాతం పెరిగి 23.76 బిలియన్ డాలర్ల వదకు చేరింది. 2021 డిసెంబర్లో ఇది 21.06 బిలియన్ డాలర్లు. కానీ 2022 నవంబర్లో నమోదైన 23.89 బిలియన్ డాలర్ల లోటుతో పోలిస్తే గత నెలలో దాదాపు స్థిరంగా ఉంది. 2022 డిసెంబర్లో దిగుమతులు వార్షిక ప్రాతిపదికన 3.5 శాతం క్షీణించి 60.33 బిలియన్ డాలర్ల నుంచి 58.24 బిలియన్ డాలర్లకు తగ్గాయి. నవంబర్లో ఇవి 55.88 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. వివరాలు…