న్యూఢిల్లీ: భారత్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్డీఐ) ల్లో భారీ పురోగతి నమోదైంది. 2020-21తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 90 శాతం ఎఫ్డీఐలు పెరిగాయి. 2020-21 తొలి మూడు నెలల్లో 11.84 బిలియన్ల డాలర్ల పెట్టుబడులు వస్తే ఈ ఏడాది 22.53 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఎఫ్డీఐ నిధులు 168 శాతం పెరిగాయి. గతేడాది (2020-21)లో 6.56 బిలియన్ డాలర్ల నిధులు స్టాక్ మార్కెట్లోకి వస్తే, ఈ ఏడాది అవి రూ.17.57 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది.
దేశీయ ఆటోమొబైల్ రంగ సంస్థల్లో 27 శాతం ఎఫ్డీఐ నిధులు వచ్చాయి. తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రంగంలోకి 17 శాతం, సర్వీస్ సెక్టార్లోకి 11 శాతం పెట్టుబడులు వచ్చాయి. ఆటోమొబైల్ రంగ ఈక్విటీల్లోకి వచ్చిన ఎఫ్డీఐల్లో 88 శాతం కర్ణాటక రాష్ట్రంలోని సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు.
మొత్తం ఎఫ్డీఐల్లోనూ కర్ణాటక 48 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, 23 శాతంతో మహారాష్ట్ర, 11 శాతంతో ఢిల్లీ తర్వాతీ స్థానాల్లో ఉన్నాయి. ఎఫ్డీఐ పాలసీ సంస్కరణలు, సులభతర వాణిజ్య నిబంధనలు సరళతరం చేయడంతో ఎఫ్డీఐ పెట్టుబడులు పెరిగాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.