ముంబై, అక్టోబర్ 25: ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) దేశ జీడీపీ వృద్ధి 9.5 శా తంగా నమో దు కావచ్చని స్విస్ బ్రోకరేజీ యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా అంచనా వేసింది. కరోనా దెబ్బకు గత ఆర్థిక సంవత్సరం (2020-21) మైనస్ 7.3 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే. అయితే భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంటున్నదని, ఈ ద్వితీయార్ధం (అక్టోబర్-మార్చి)లో మరింత పరుగులు తీయగలదన్న ఆశాభావాన్ని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా ప్రధాన ఆర్థికవేత్త తన్వీ గుప్తా జైన్ తాజాగా వ్యక్తం చేశారు. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) భారత జీడీపీ 7.7 శాతానికి పడిపోవచ్చన్నారు. కాగా, ఇటీవలికాలంలో రోజూ పెరుగుతూపోతున్న ఇంధన ధరలతోపాటు విద్యుదుత్పాదక సంస్థలను వేధిస్తున్న బొగ్గు కొరత వల్ల జీడీపీ వృద్ధికి అంతరాయం కలుగవచ్చని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు.