న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 : దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ మరో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తాజాగా హెలికాప్టర్ల తయారీలోకి ప్రవేశించారు. ఇందుకోసం ఇటలీకి చెందిన ప్రముఖ హెలికాప్టర్ల తయారీ సంస్థ లియోనార్డ్తో అదానీ గ్రూపు ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంలో భాగంగా దేశీయంగా హెలికాప్టర్ల తయారీ ఎకోసిస్టాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.
ఇందుకు సంబంధించి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, లియోనార్డ్ కంపెనీల ప్రతినిధులు మంగళవారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ భాగస్వామ్యం ద్వారా దేశంలో ఇంటిగ్రేటెడ్ హెలికాప్టర్ తయారీ ఎకోసిస్టమ్ను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా దేశీయ సైన్యం, వైమానిక దళాల అవసరాలను తీర్చే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరినట్టు తెలుస్తున్నది. లియోనార్డ్ సంస్థకు చెందిన ఏడబ్ల్యూ 169 ఎం, ఏడబ్ల్యూ109 ట్రెక్కర్ హెలికాప్టర్లు దేశీయంగా తయారు చేయనున్నారు.