హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో ఈ-పంచాయతీ అవార్డు సాధించడంపై పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఎంపీడీవో, జడ్పీ సీఈవోల సంఘాల నేతలు అభినందించారు. ఆదివారం హైదరాబాద్లోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంత్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. అర్హులైన ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. సీఎం కేసీఆర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పినట్టు వారు పేర్కొన్నారు. మంత్రిని కలిసినవారిలో సీఈవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేందర్రావు, ఎంపీడీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్తయ్య తదితరులు ఉన్నారు.