India Post Warns | ఇటీవలి కాలంలో వాట్సాప్, టెలిగ్రామ్, ఈ-మెయిల్స్, ఎస్ఎంఎస్ల్లో చిన్న యూఆర్ఎల్స్, షార్ట్ యూఆర్ఎల్స్ రావడాన్ని గమనించినట్లు ఇండియా పోస్టు తెలిపింది. పలు సర్వేలు, క్విజ్ల ద్వారా ప్రభుత్వ సబ్సిడీలు వస్తున్నాయని ఈ లింక్ల్లో సమాచారం ఇస్తున్నారని, వీటిని నమ్మొద్దని ప్రజలకు ఇండియా పోస్ట్ సూచించింది. తమ సంస్థ పేరిట వచ్చే ఈ లింక్లను నమ్మొద్దని హితవు చెప్పింది.
సబ్సిడీలు, బోనస్లు, సర్వే ఆధారిత ప్రైజ్లు ఇచ్చే కార్యక్రమాల్లో ఇండియా పోస్ట్ భాగస్వామి కావడం లేదని దేశ పౌరులకు స్పష్టత ఇవ్వదలిచాం. ప్రజలకు వచ్చే ఇటువంటి నోటిఫికేషన్లు, మెసేజ్లు, ఈ-మెయిల్స్ను నమ్మొద్దు. అనుమానాస్పద, ఫేక్ మెసేజ్లను షేర్ చేయొద్దు. ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయొద్దు అని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
జన్మ దినోత్సవ తేదీ, బ్యాంకు ఖాతా నంబర్లు, మొబైల్ నంబర్లు, పుట్టిన స్థలం, ఓటీపీ తదితర వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని షేర్ చేయొద్దని పేర్కొంది. ఇటువంటి మెసేజ్ల వల్ల జరిగే నష్టానికి తాము బాధ్యత వహించబోమని ఇండియా పోస్ట్ స్పష్టం చేసింది. సోషల్ మీడియా ద్వారా వచ్చే యూఆర్ఎల్స్, వెబ్సైట్లు పూర్తిగా ఫేక్ అని ఇండియా పోస్ట్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలిపాయి.