బీజింగ్, అక్టోబర్ 26: చైనాతో భారత్ వాణిజ్య లోటు మరింత ఎగిసింది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్లో రూ.6,20,658 కోట్లు (75.69 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం ఈ 9 నెలల్లో రూ.8,49,766 కోట్లు (103.63 బిలియన్ డాలర్లు)గా ఉన్నది.
గత ఏడాదితో చూస్తే ఇది 14.6 శాతం ఎక్కువ. కాగా, భారత్-చైనా ట్రేడ్ విలువ 100 బిలియన్ డాలర్ల మార్కును దాటడం ఇది వరుసగా రెండో ఏడాది కావడం గమనార్హం. ఈ ఏడాది తొలి 9 నెలల్లో భారత్కు చైనా ఎగుమతులు రూ.7,35,212 కోట్లు (89.66 బిలియన్ డాలర్లు)గా ఉన్నాయి. నిరుడుతో పోల్చితే 31 శాతం అధికమని చైనా తెలిపింది. భారత్ నుంచి చైనాకు ఎగుమతులు కేవలం రూ.1,14,554 కోట్లు (13.97 బిలియన్ డాలర్లు)గానే ఉన్నాయి. గతంతో పోల్చితే 36.4 శాతం తగ్గాయి.