న్యూఢిల్లీ, ఆగస్టు 10: విద్యుత్తో నడిచే వాహనాలపై ఇస్తున్న రాయితీలను కొనసాగించాలని ఇండియన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కౌన్సిల్(ఐఈఎంసీ) డిమాండ్ చేస్తున్నది. కాలుష్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో గతంలో హైబ్రిడ్, ఈవీల వాడకాన్ని పెంపొందించేడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్కీంలను ప్రవేశపెట్టిందని, కానీ, ఇప్పుడు వీటికి మంగళం పాడే యోచనలో ఉన్నదని ఐఈఎంసీ వర్గాలు విమర్శిస్తున్నారు. ఈవీలను ఉత్పత్తి చేయండి..రాయితీలు పొందండి అని 2015లో ప్రత్యేక ఫేమ్-1, ఆ తర్వాత ఫేమ్-2 స్కీంలను ప్రవేశపెట్టిన మోదీ సర్కార్..ప్రస్తుతం వాహనాలపై ఇస్తున్న రాయితీలను పూర్తిగా ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ రాయితీలను కోత పెట్టడంతో 2030 నాటికి దేశంలో ఈవీల డిమాండ్ గతంలో 12.5 కోట్లకు చేరుకుంటుందని అంచనావేసినప్పటికీ, ప్రస్తుత నిర్ణయంతో దీంట్లో నాలుగోవంతు 3దీంతో ఈవీల డిమాండ్ 125 మిలయన్ల నుంచి 3.7 కోట్లకు పడిపోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది.
రాయితీలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో ఈవీ వాహన ధరలు భారీగా పెరిగాయని, దీంతో వాహన విక్రయాలు నిలిచిపోయాయని ఐఈఎంసీ వర్గాలు వెల్లడిస్తున్నారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న 80 ఈవీ కంపెనీలు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇప్పుడిప్పుడే ఈవీల వాడకం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కేంద్రం పిడుగు వేసిందని, ఫేమ్-2 సబ్సిడీలను ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయంతో ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహన ధరలు రూ.30 వేల వరకు పెరగనుండటంతో గత రెండు నెలల్లోనే అమ్మకాలు 50 శాతం వరకు పడిపోయాయని పేర్కొంది. ఒక్కో కిలోవాట్పై ఇచ్చే సబ్సిడీ రూ.15 వేల నుంచి రూ.10 వేలకు తగ్గించిన విషయం తెలిసిందే.