Mobile Subscribers | ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ తప్పనిసరి.. ఫోన్ సంభాషణ మొదలు అన్ని రకాల డిజిటల్ పేమెంట్స్ వరకూ ఫోన్లపైనే జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై -సెప్టెంబర్ త్రైమాసికం నాటికి ప్రపంచంలోకెల్లా అత్యధిక మొబైల్ సబ్ స్క్రైబర్లు గల దేశంగా భారత్ నిలువనున్నది. మొబైల్ ఫోన్ల యూజర్లలో జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్లో 70 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లు జత కలుస్తారు. తర్వాతీ జాబితాలో 50 లక్షలతో చైనా, 30 లక్షల కస్టమర్లతో అమెరికా.. రెండవ, మూడవ స్థానాల్లో నిలిచాయి.
టెలికం మార్కెట్లో పోటీ, తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండటం వల్లే భారత్లో మొబైల్ సబ్ స్క్రైబర్లు పెరుగుతున్నారని టెక్ దిగ్గజం ఎరిక్సన్ ఓ నివేదిక తయారు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది 5జీ యూజర్లు ఉన్నారని తెలిపింది. వారిలో కొత్తగా నాలుగు కోట్ల మంది జూన్ నెలో చేరారని పేర్కొంది. మొత్తం మొబైల్ ఫోన్ యూజర్ల సంఖ్య 830 కోట్లకు చేరుకున్నది.
భారత్లో కొత్తగా 70 లక్షల మొబైల్ సబ్ స్క్రైబర్లు పెరగడంతో మొత్తం మొబైల్ ఫోన్ యూజర్ల సంఖ్య 112.5 కోట్లకు చేరుకున్నది. ఇదే సమయంలో చైనాలో 169.5 కోట్ల మంది మొబైల్ ఫోన్ సబ్ స్క్రైబర్లు జత కలిశారు. దీంతో జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికం నాటికి 17.5 కోట్ల మంది 5జీ సబ్ స్క్రైబర్లు నమోదవుతారని ఎరిక్సన్ వ్యాఖ్యానించింది.