India invest in Gold | బంగారం అంటే భారతీయులకు కేవలం విలువైన లోహం మాత్రమే కాదు.. ఓ ఏమోషన్.. భావోద్వేగం. బంగారం కొనుగోలు చేస్తున్నందుకు ఇండియన్స్ ఎంతమాత్రమూ విచారించరంటే అతిశయోక్తి కాదు. భారతీయుల అవసరాల్లో కేవలం 10 శాతం గోల్డ్ మాత్రమే దేశీయంగా మైనింగ్ అవుతున్నది. ద్రవ్యోల్బణ వేళ, అనిశ్చితి, రూపాయి మారకం విలువ పతనం సమయంలో సురక్షిత పెట్టుబడి మార్గంగా బంగారం ఆదుకుంటుంది. ఇప్పుడు పలు దేశాల కేంద్రీయ బ్యాంకులు ఇబ్బడిముబ్బడిగా బంగారం కొనుగోలు చేశాయి. కొనుగోళ్లకు చర్యలు చేపట్టాయి. కానీ, గతేడాది (2022) బంగారం కొనుగోళ్లలో భారత్ది నాలుగో స్థానం. ఇటీవల క్రిప్టో కరెన్సీలు కుప్పకూలడం, ద్రవ్యోల్బణ సవాళ్లు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి.
ప్రపంచ ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని ప్రపంచంలోని వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు 78.6 శాతం అంగీకరిస్తున్నాయి. అంతే కాదు. గ్లోబల్ ద్రవ్య విధానాల్లోనూ మార్పులు వస్తాయని ఆయా బ్యాంకులు 57.1 శాతం భావిస్తున్నాయి. మరో 57.1 శాతం కేంద్రీయ బ్యాంకులు అమెరికాలో ఆర్థిక సవాళ్లు ఉన్నాయని అంచనా వేస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావాన్ని అధిగమించేందుకు బంగారం కొనుగోలు చేయడం మంచిదని 50 శాతం సెంట్రల్ బ్యాంకులు భావించాయి.
గతేడాది బంగారం కొనుగోళ్లలో టర్కీ టాప్ స్థానంలో నిలిచింది. గతేడాది జనవరి-సెప్టెంబర్ మధ్య 94.63 టన్నులు కొనుగోలు చేసింది టర్కీ. మరో దేశం ఈజిప్ట్ కొనుగోలు చేసిన 44.41 టన్నులతో పోలిస్తే టర్కీ రెట్టింపుకు పైగా సొంతం చేసుకున్నది టర్కీ. ఇరాక్ 33.90 టన్నులు, ఇండియా 31.25 టన్నులు, ఖతార్ 30.29 టన్నులు, ఉజ్బెకిస్తాన్ 27.99 టన్నులు కొనుగోలు చేశాయి. గత నవంబర్లో భారత్ మొత్తం ఫారెక్స్ రిజర్వుల్లో బంగారం వాటా 7.26 శాతం.