కిడ్నీ బాధితులకు మరిన్ని సౌకర్యాల కల్పనకు కృషి
సహాయానికి దాతలు ముందుకురావాలి
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పిలుపు
ఖైరతాబాద్, మార్చి 29: కిడ్నీ బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ తెలిపారు. కిడ్నీ బాధితుల కోసం నిమ్స్లో అందిస్తున్న సేవలను మరింతగా విస్తృతం చేసేందుకు తన ఎంపీ లాడ్స్ నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. కొవిడ్ వ్యాక్సిన్ కోసం సోమవారం నిమ్స్కు వచ్చిన ఎంపీ సంతోష్.. డయాలిసిస్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్కు దీటుగా నిలపాలని సంకల్పించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమా రు పదివేలమంది కిడ్నీ బాధితులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన డయాలిసిస్ కేంద్రాలను వినియోగించుకుంటున్నారని చెప్పారు. నిమ్స్లో డయాలిసిస్ కేంద్రాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉన్నదని, బెడ్ల సంఖ్యను పెం చేందుకు.. సౌకర్యాలు మెరుగుపర్చేందుకు తన ఎంపీలాడ్స్ నిధులను కేటాయిస్తానని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపాలని సూచించారు. సీఎస్ఆర్ కింద కూడా నిధులను సమీకరించుకోవడానికి వీలున్నదని.. దీనికి సంబంధించి కూడా దాతలను కోరుతానని చెప్పారు. కిడ్నీ బాధితులకు నిరంతరం సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ఎంపీ వెంట ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కే మనోహర్, సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, అనుసంధానాధికారి డాక్టర్ మార్త రమేశ్ ఉన్నారు.