ముంబై, సెప్టెంబర్ 22: కెప్టెన్లు, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్ల జీతాలను స్పైస్జెట్ పెంచింది. అక్టోబర్ నుంచి వీరి వేతనాలు దాదాపు 20 శాతం పెరుగుతాయని ప్రకటించింది. కాగా, ప్రభుత్వ రుణ హామీ పథకం ఈసీఎల్జీఎస్ కింద తొలి విడుత నిధులు అందుకున్న నేపథ్యంలోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఇక ప్రస్తుతం నష్టాల్లో నడుస్తున్న ఈ కంపెనీ.. వచ్చే 2-3 వారాల్లో ఉద్యోగులందరి టీడీఎస్నూ డిపాజిట్ చేయనున్నది. ఈ మేరకు బుధవారం పైలట్లకు స్పైస్జెట్ సంస్థ సమాచారం ఇచ్చింది.