ముంబై, జనవరి 2: దేశంలో ఉత్పత్తయిన ముడి చమురుపై విండ్ఫాల్ ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం పెంచింది. అలాగే డీజిల్, విమాన ఇంధన ఎగుమతులపై సుంకాన్ని జీరో శాతానికి తగ్గించింది. దేశీయంగా ఉత్పత్తయ్యే క్రూడాయిల్పై ప్రత్యేక అదనపు ఎక్సయిజు సుంకం రూపంలో విధిస్తున్న విండ్ఫాల్ ట్యాక్స్ను టన్నుకు రూ.1,300 నుంచి రూ. 2,300కు పెంచినట్టు మంగళవారం విడుదలైన నోటిఫికేషన్లో తెలిపింది. డీజిల్ ఎగుమతులపై ట్యాక్స్ను లీటరుకు రూ.0.50 నుంచి నిల్ చేయగా, విమాన ఇంధనంపై రూ.1 నుంచి జీరో చేశారు. కొత్త రేట్లు తక్షణమే అమలులోకి వచ్చాయి. 2022 జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ఇంధన కంపెనీలు ఆర్జించే అధిక లాభాలపై విండ్ఫాల్ ట్యాక్స్ విధించడం ప్రారంభించింది. రెండు వారాల ముడి చమురు సగటు ధర ఆధారంగా ప్రతీ పక్షం రోజులకోసారి ఈ పన్ను రేట్లను సవరిస్తున్నది.