Recurring deposit | న్యూఢిల్లీ, జూన్ 30: బ్యాంక్ డిపాజిట్లు అందిస్తున్న అధిక రేట్లకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్తో సహా కొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 0.3 శాతం మేర పెంచింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి ఈ పెంపుదల వర్తిస్తుందని శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఐదేండ్ల రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ)పై 0.3 శాతం రేటు పెరుగుతుంది. ఆర్డీలు వేసినవారికి ప్రస్తుత 6.2 శాతం వడ్డీ రేటుకుగాను ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో 6.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఇతర స్కీమ్లపై తాజా పెంపు వివరాలు…