Tech Layoffs : ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు భారీ లేఆఫ్స్ ప్రకటిస్తుండటంతో 2024 ఏడాది ఆరంభంలోనే టెకీల్లో గుబులు రేపుతోంది.ఆర్ధిక మందగమనం కొనసాగుతుండటం, పలు కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతుండటంతో ఈ ఏడాది నియామకాల ప్రక్రియ మందగించింది. మరోవైపు క్యాంపస్ నియామకాలకూ పలు కంపెనీలు మొగ్గుచూపడం లేదు.
ట్విట్టర్ మొదలుకుని, మెటా నుంచి గూగుల్ వరకూ, అమెజాన్, మైక్రోసాఫ్ట్ సహా పలు కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన టెకీలు తమ అనుభవాలను లింక్డిన్లో షేర్ చేస్తున్నారు. ఇక గడిచిన ఏడాదిలో నాలుగు ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్ర ఏకంగా 67.000కుపైగా ఉద్యోగులపై వేటు వేశాయని తాజా నివేదిక వెల్లడించింది.
ఇన్ఫోసిస్ 24,182 మంది ఉద్యోగులను తొలగించగా, విప్రో 21,875 మందిని, టీసీఎస్ 10,818 మందిని, టెక్ మహీంద్ర 10,669 మంది ఉద్యోగులను సాగనంపాయి. లేఆఫ్స్కు తోడు నియామకాలను కూడా ఐటీ కంపెనీలు పెద్దగా చేపట్టలేదని నౌక్రీ.కాం వివరాల ఆధారంగా వెల్లడైంది. హైరింగ్ మందగించడంతో పాటు గత ఏడాది విప్రో ఫ్రెషర్స్ జాబ్ ఆఫర్స్ను ఏకంగా 50 శాతం కుదించింది. ఫ్రెషర్స్కు గత ఏడాది విప్రో రూ. 6.5 లక్షల వేతన ప్యాకేజ్ ఆఫర్ చేయగా ఆపై స్ధూల ఆర్ధిక వాతావరణం సాకుగా చూపుతూ ఫ్రెషర్స్ వేతన ప్యాకేజ్లను సవరించడం కలకలం రేపింది.
Read More :
Bob Moore | ఉద్యోగులకు కంపెనీ రాసిచ్చిన మిలియనీర్