ITR filings | గత ఆర్థిక సంవత్సర (2023-24 మదింపు) ఐటీ రిటర్న్స్ దాఖలులో సరికొత్త రికార్డు నమోదైంది. శుక్రవారం కల్లా ఎనిమిది కోట్ల మందికి పైగా పౌరులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు ఆదాయం పన్ను విభాగం తెలిపింది. తద్వారా కేంద్ర ఆర్థికశాఖ పరిధిలో ఉన్న ఐటీ విభాగం సరికొత్త రికార్డు నమోదైందని తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఐటీఆర్ ఫైలింగ్స్లో 6.44 శాతం గ్రోత్ నమోదైంది. గతేడాది 2022-23 మదింపు (2021-22) ఆర్థిక సంవత్సరంలో 7,51,60,817 మంది ఐటీఆర్ దాఖలు చేశారని ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ ఖాతాలో వెల్లడించింది.
గత ఆర్థిక సంవత్సర ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి గత జూలై 31తో గడువు ముగిసినా ఐటీఆర్ ఫైల్ చేయని వారికి మరో చాన్స్ ఉంది. ఆదివారం (2023 డిసెంబర్ 31) అర్ధరాత్రి లోపు ‘బీ లేటెడ్ ఐటీఆర్’ ఫైల్ చేసుకోవచ్చు. సకాలంలో ఫైల్ చేసిన ఐటీఆర్’లో తప్పులు ఉన్నా, పొరపాట్లు దొర్లినా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. సదరు తప్పులు దిద్దుకోకపోతే భవిష్యత్లో ఐటీ విభాగం నుంచి నోటీసులు రావచ్చు.
↗️Unique landmark for the Income-tax Department!
↗️Over 8 crore ITRs filed for the AY 2023-24 till date.
↗️This milestone has been reached for the first time.
↗️The total filing for AY 2022-23 was 7,51,60,817.
Income-tax Department expresses its gratitude to all the… pic.twitter.com/kufWymunuK
— Income Tax India (@IncomeTaxIndia) December 29, 2023