న్యూఢిల్లీ : భారత్, అమెరికన్ పారిశ్రామిక దిగ్గజాలు గౌతం అదానీ, ఎలన్ మస్క్లు ఒక్క రోజులోనే రూ . 2 లక్షల కోట్లు పైగా నష్టపోయారు. సోమవారం వారి కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లలో పడిపోవడంతో వారి సంపద కొద్ది గంటల్లోనే ఆవిరైంది. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఇద్దరి వ్యాపారవేత్తలకు ఎదురైన నష్టాలను వివరించింది.
గౌతం అదానీకి చెందిన అదానీ పవర్, అదానీ విల్మర్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్ సహా ఆయన గ్రూపునకు చెందిన పలు సంస్ధల షేర్లు స్టాక్ మార్కెట్లో సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. అదానీ సంస్ధల షేర్లు దారుణంగా పడిపోవడంతో ఆయన ఒక్కరోజులోనే ఏకంగా రూ 78,913 రూపాయలు కోల్పోయారు.
మరోవైపు టెస్లా అధినేత ఎలన్ మస్క్ తన ఆటోమొబైల్ కంపెనీ షేర్లు 8.6 శాతం కుదేలవడంతో 24 గంటల్లోనే రూ 1.26 కోట్ల సంపద నష్టపోయారని బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లెక్కగట్టింది. మస్క్ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నామస్ ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఇక ప్రపంచ కుబేరుల్లో అదానీ ప్రస్తుతం నాలుగో స్ధానంలో ఉన్నారు.